. . . పీసీసీ చీఫ్ మహేష్ తో పాటు నాయకులు అరెస్ట్
హైదరాబాద్, బతుకమ్మ :
ప్రధాని నివాసం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితర ప్రతిపక్ష నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ, అలాగే నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ నుంచి ‘ఛలో లోక్ భవన్’ పేరిట నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ర్యాలీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు లను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

