. . . కార్పొరేటర్లకు దిశ నిర్దేశం చేసిన ఎంపీ అర్వింద్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:
సర్ ప్రక్రియ సమయంలో ఏ అర్హత గల ఓటరు కూడా తమ ఓటు హక్కును కోల్పో కూడదని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. గురువారం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సర్ పై కార్పొరేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ… సర్ పై ప్రతి డివిజన్లో అవగాహన కల్పించి, ప్రజలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలను కోరారు.

ప్రక్రియలో ఏ అర్హత గల ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా ఉండేందుకు కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని సూచించారు. ప్రతి డివిజన్లో ప్రజలకు అవగాహన కల్పించి, అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపీడీ శ్రావంతి రెడ్డి, ఇందూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్ పాల్గొన్నారు.

