ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద ఎస్ఐ భూక్య సుమలత ఆదేశాల మేరకు ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహన దారులు తప్పకుండా సీటు బెల్ట్ ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడవద్దన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి, డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే పదివేల రూపాయలు జరిమాన లేదా వారం రోజుల జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఎస్ఐ తెలిపారు.
