. . . ఏర్గట్ల తహసీల్దార్ జె. మల్లయ్య
ఏర్గట్ల, బతుకమ్మ :
2026 ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపి సమర్పించాలని ఏర్గట్ల మండల తహసీల్దార్ జె. మల్లయ్య సూచించారు. ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ ఎన్యుమరేషన్ ఫారంపై ఇప్పటికే ఉన్న పాత ఫోటోతో పాటు, ఇటీవల తీసిన స్పష్టమైన పాస్పోర్ట్ సైజు రంగు ఫోటోను అతికించి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)కు అందజేయాలని తెలిపారు. కాబట్టి ఏర్గట్ల మండల పరిధిలోని అన్ని గ్రామాల ఓటర్లు తమ ముఖం స్పష్టంగా కనిపించే విధంగా కొత్త పాస్పోర్ట్ సైజు ఫోటోలను ముందుగానే సిద్ధం చేసుకుని ఇంటి వద్ద ఉంచుకోవాలని తహసీల్దార్ జె. మల్లయ్య కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో ప్రతి ఓటరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
