29 C
Hyderabad
Monday, August 3, 2026

అనారోగ్య బాధితునికి ఎల్ ఓ సీ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

అనారోగ్యంతో బాధపడుతున్న బనావత్ పత్తికి రూ.1.50 లక్షల ఎల్ఓసీని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం అందజేశారు. మండలంలోని తాళ్లపల్లి గ్రామానికి చెందిన బనావత్ పత్తి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో, వైద్య ఖర్చుల కోసం రూ.1,50,000 ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎమ్మెల్యే మంజూరు చేయించారు. ఈ మేరకు ఎమ్మెల్యే  రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎల్ ఓ సీ కాపీని రోగి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తమ చికిత్స కోసం ఎల్ ఓ సీ మంజూరు చేయించి ఇచ్చిన ఎమ్మెల్యేకు బనావత్ పత్తి కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

More articles

Latest article