ఎల్లారెడ్డి, బతుకమ్మ :
నాగిరెడ్డి పెట్ మండలం లోని పోచారం ప్రాజెక్ట్ టూరిజం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశానుసారం స్థలాన్ని బుధవారం ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నే ప్రభాకర్ , ఎల్లారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామిరెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా పోచారం ప్రాజెక్టును టూరిజం అభివృద్ధి లో భాగంగా స్థలాన్ని పరిశీలించారు.అనంతరం వెంకంపల్లి బ్రిడ్జి ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సొసైటీ చైర్మన్ అకిడి గంగారెడ్డి,వైస్ చైర్మన్ బాబు రావు, నాగిరెడ్డి పెట్ మాజీ ఎంపీపీ రాజ్ దాస్,మాజీ ఎంపిపి సంజీవులు, తాండూర్ సర్పంచ్ సంగమేశ్వర్,సొసైటీ డైరెక్టర్ బన్సీ, కిషన్ తదితరులు పాల్గొన్నారు..