. . . జిల్లా క లెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు కలెక్టర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా వి.భుజంగరావు నియమితులు అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నియామక ఉత్తర్వులు వెలువరించగా శనివారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠిని ఆమె చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అదనపు కలెక్టర్ భుజంగరావును వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి పూల బొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

