బాన్సువాడ, బతుకమ్మ :
వర్ని మండలంలోని సిద్దాపూర్ గ్రామం వద్ద రూ.120 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం పరిశీలించారు. కాంట్రాక్టర్ తో రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట వర్ని, బాన్సువాడ గ్రామీణ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, సిద్దాపూర్ చుట్టూ ప్రక్కన గ్రామాల ప్రజలు ఉన్నారు.



