. . . ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతల బృందం
హైదరాబాద్, బతుకమ్మ :
ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా జరపాలని ఎన్నికల అధికారికి కాంగ్రెస్ నేతల బృందం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి తో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బలమురి వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, నవీన్ యాదవ్, గణేష్, కార్పొరేషన్ చైర్మన్ లు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
