28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

4 లక్షల రూపాయల ఎల్ఓసీ అందజేత

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

మోర్తాడ్ మండలం పాలెం గ్రామానికి చెందిన యెలుమల శంకర్ గతంలో హార్ట్ ఎటాక్ రావడంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్లో చేరారు. ఆయనకు గుండెలో ఇంకొక్క బ్లాక్ ఏర్పడిందని స్టంట్ వేయాలని వైద్యులు సూచించగా అందుకు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని తెలుపగా శంకర్ పేద కుటుంబం కావడంతో ఖర్చు బరించే స్తోమత లేనందున, వారి కుటుంబ సభ్యులు వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ సునీల్ కుమార్ ను సంప్రదించారు. ఆయన స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.4 లక్షలకు ఎల్ఓసీ ని అందించారు. ఆపద సమయంలో ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ కి వారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

More articles

Latest article