. . . అభివృద్ధి పనులకు సహకరించండి
. . . సీఎం రేవంత్ రెడ్డిని కోరిన బిజేపి ఎమ్మెల్యేలు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ – కామారెడ్డి ఉమ్మడి జిల్లాలోని ప్రోటోకాల్ ఉల్లంఘనల పై బిజేపి ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డిలు సీఎం రేవంత్ రెడ్డికి మరో సారి ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా అసెంబ్లీ హాల్ లో సీఎం కు కామారెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గం లోని పలు అభివృద్ధి, సమస్యల పై వినతులను సమర్పించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి లు ముఖ్యమంత్రి ని కలిసి చర్చించడం జరిగింది. సీఎం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.
