. . . వెల్లుట్ల గ్రామస్తుల వినతి
ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండలం లోని వేల్లుట్ల గ్రామంలో బెల్టుషాపులు మూసివేయాలని సోమవారం వేల్లుట్ల గ్రామ ప్రజలు ఎక్సైజ్ సి ఐ షకీర్ అహ్మద్ కి వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో బెల్ట్ షాపుల విచ్చల విడిగా మద్యం అమ్మకాలు చేయటం వల్ల నిత్యం గొడవలు అవుతున్నాయిని యువత పెడదారి పడుతున్నారని అన్నారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్లుట్ల గ్రామస్థులు లింగపురం సాయిలు, జక్కుల సంతోష్ కుమార్, పోతుగంటి సాయిలు, కన్నెబొయిన రాజు, బెగారి రవి, కృష్ణ, గౌతమ్, రమేష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
