29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం

Must read

📰 Generate e-Paper Clip

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భిక్కనూర్ పట్టణానికి చెందిన శ్రీనిధి జిల్లా స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబర్చినందుకు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని, క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ క్రీడాకారులకు అండగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

More articles

Latest article