నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నగరంలోని 50వ డివిజన్ నుండి బీజేవైఎం జిల్లా కార్యాలయ కార్యదర్శి చైతన్య కులకర్ణి బీజేపీ టికెట్ కోసం బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి దరఖాస్తు పత్రాలు మంగళవారం అందజేశారు. భారతీయ జనతా పార్టీకి నిబద్ధంగా పని చేస్తూ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వ మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారమే నా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నానని కులకర్ణి వెల్లడించారు. పార్టీ తరఫున ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవ చేయాలనే ఆకాంక్షతో టికెట్ ఆశిస్తున్నట్లు తెలిపారు. .ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకుని అవకాశం కల్పించాలని కోరారు.
