. . . 11 మందికి జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం తాగి వాహనాలు నడిపిన 16 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం మంగళవారం ట్రాఫిక్ సి ఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ఎదుట హాజరుపరిచారు. 11 మందికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున 1,10,000 జరిమానా విదించగా వారిలో ఐదుగురికి పట్ల శ్రీకాంత్, బుక్య రామ్ కిరణ్, చిన్నోల కృష్ణ, గంగన్న గారి గోవర్ధన్ గౌడ్, మెగావత్ సుదల్ లకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు సిఐ ప్రసాద్ తెలిపారు.
