నిజామాబాద్ క్రైం , బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ పరిధిలోని ముబారక్ నగర్ లో పలువురు ఇండ్లలో చోరి జరిగింది. ఈ సంఘటన మంగళవారం అలస్యంగా వెలుగు లోకి వచ్చింది. ముబారక్ నగర్ లోని పెద్ధమ్మగుడి రోడ్డులోని చర్చ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రాత్రి నాలుగు ఇండ్లలో తాళాలు పగుల గోట్టి చోరికి పాల్పడ్డారు. అయితే ఇంటి యాజమానులు వచ్చిన తరువాత గాని ఎంత సోత్తు చోరికి గురైంది తెలిసే అవకాశం లేదు. సంబంధిత కోన్ని ఇండ్లలో సిసి టివి పుటేజీలలో చోరి ద్రశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ తెలిపారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి, వేలి ముద్రలు, ఆనవాళ్లు సేకరించారు.


