ఏర్గట్ల, బతుకమ్మ :
ఏర్గట్ల మండల కేంద్రంలో సోమవారం రోజున రాష్ట్ర కోపరేటివ్ సహకార లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, పలు కుటుంబాలను పరామర్శించారు. ఏర్గట్ల లో దొబ్బల లస్మన్న, సైదు నరేష్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు, ఇరు కుటుంబాలను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.అలాగే సైదు నరేష్ కుటుంబానికి,ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోరిపల్లి లింగారెడ్డి, ఏర్గట్ల మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్, నాగేంద్ర నగర్ సర్పంచ్ సందే రంజిత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడేం గంగ ప్రసాద్, మండల్ మైనార్టీ ప్రెసిడెంట్ ఎం.డి.మునిరుద్దీన్, రొక్కేడ సంజీవ్, సున్నపు శ్రీనివాస్, కూరాకుల సాయన్న, సాంసన్, ఈర పట్నం శ్రీను, పోశెట్టి, రాజ గంగారం, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
