23.7 C
Hyderabad

గోవిందరాజ స్వామివారి ఆలయంలో భారీ గోల్ మాల్!

Must read

📰 Generate e-Paper Clip

తిరుపతి, బతుకమ్మ:  తిరుపతి గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన గోపుర పనుల్లో భారీ స్థాయిలో గోల్ మాల్ జరిగిందన్నఆరోపణలు వినిపిస్తున్నాయి.  నిబంధనల ప్రకారం గోపురానికి తొమ్మిది పొరల స్వర్ణ తాపడం చేయాల్సి ఉండగా, కేవలం రెండు పొరలతోనే పని కానిచ్చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ క్రమంలో దాదాపు 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.  స్వర్ణ తాపడం పనులు జరుగుతున్న క్రమంలో అత్యంత అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల గోపురంపై ఉన్న సుమారు 30 పురాతన విగ్రహాలు దెబ్బతిన్నాయని సమాచారం.

More articles

Latest article