బతుకమ్మ భిక్కనూరు: ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి రాష్ట్రస్థాయి పోటీలకు భిక్కనూరు విజ్ఞాన్ పాఠశాలకు చెందిన విద్యార్థి మణిదీప్ ఎన్నికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ విజయభాస్కర్ రెడ్డి ఒక ప్రకటన తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో నైపుణ్యం ఉండాలని విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఎన్నికైన విద్యార్థి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరచాలని అన్నారు.
