మోర్తాడ్, బతుకమ్మ:స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలుబడడంతో ప్రత్యేక అధికారి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని సుంకేట్, తిమ్మాపూర్, మోర్తాడ్ గ్రామాల్లో సోమవారం వాహనాలు తనిఖీ నిర్వహించారు. ఎన్నికలు కోడ్ ఉన్న నేపథ్యంలో వాహనదారులు ఎక్కువ మొత్తంలో డబ్బు తమ వెంట తీసుకుపోవద్దని ఆయన తెలియజేశారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరికితే జప్తు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఐకెపి సిసి తడకల శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
