28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పదో తరగతి  విద్యార్థి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

 నిజామాబాద్,  బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక మైనారిటీ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థి ఆదివారం రాత్రి తన గదిలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ప్రిన్సిపల్,  పోలీసులు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు.  విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి  చదువు ఒత్తిడి నే కారణమా.. లేదా ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయనే కోణంలో  స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  దర్యాప్తు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై సాయన్న వివరించారు.

More articles

Latest article