28.8 C
Hyderabad
Monday, August 3, 2026

10 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 44,268 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 10 గేట్లను ఎత్తి గోదావరిలోకి 29,678 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. కాకతీయ కాలువ ద్వారా 6800, ఎస్కేప్ గేట్ల ద్వారా 1200, లక్ష్మి కెనాల్ ద్వారా 150, సరస్వతి కెనాల్ ద్వారా 500, వరద కాలువకు 5000 క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతుంది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 80.501 టీఎంసీలతో నీటిమట్టం నిలకడగా ఉంది.

More articles

Latest article