హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లో గుండెపోటుతో 14 ఏళ్ల విద్యార్థి మృతి చెందాడు. మైలార్ దేవ్ పల్లి బాబుల్ రెడ్డి నగర్ లో శుక్రవారం రాత్రి ఆడుకుంటూ 8వ తరగతి చదువుతున్న అభయ్ అనే విద్యార్థి స్పృహ తప్పి పడిపోయాడు. కుటుంబీకులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
