నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల వీధి నిర్వహణలో వీర మరణం పొందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. ఆ కుటుంబానికి రావాల్సిన ఉద్యోగ విషయమై కలెక్టర్, సీపీతో మాట్లాడారు. అనంతరం ఆ కుటుంబానికి మెరుగైన వైద్యం అందేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి నందు సూపరిడెంట్ తో మాట్లాడారు. వీధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేస్తూ పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఆయనతో పాటు నుడా చైర్మన్ కేశ వేణు,నాగేష్ రెడ్డి, నరాల రత్నాకర్, తదితరులు ఉన్నారు.

