- అభినంధించిన సీపీ సాయి చైతన్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: కానిస్టేబుల్ కుమారుడు ఛత్రపతి శివాజీకి ఎంబీబీఎస్ లో 829వ ర్యాంక్ సాధించారు. నగరంలోని నాందేవ్ వాడ కు చెందిన ట్రాన్స్ కో విజిలెన్స్ కానిస్టేబుల్ సతీష్, మమత దంపతుల కుమారుడు ఛత్రపతి శివాజీ ఎం బీబీ ఎస్ లో 829 ర్యాంక్ సాధించి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో సీటు సాధించడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఎం బీ బీ ఎస్ సీటు సాధించిన విద్యార్థిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు.ఛత్రపతి శివాజీ ఎం బీ బీ ఎస్ లో సీటు సాధించడం పట్ల బంధువులు, స్నేహితులు అభినందనలు తెలిపారు.
