హైదరాబాద్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ వద్ద సోమవారం భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పండుగ ముగించుకుని ప్రజలు తిరిగి హైదరాబాద్కు చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్లో రద్దీ పెరిగింది. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరారు. రోడ్డు మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం నెలకొనడంతో ప్రయాణికులు మెట్రోకు పొటెత్తారు. ఎస్కలేటర్లు బంద్ చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

