బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని గాజులపేట్ లో శ్రీ సంతోషి మాతాయూత్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గా మాత పండగను పురస్కరించుకొని ఎనిమిదవ రోజు మంగళవారం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. యజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గా మాత దేవిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకొని మహా అన్నదాన కార్యక్రమంలz భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మహా అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు నగర ప్రజలకు స్వాములకు అందరికీ శ్రీ సంతోషి మాతా కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర ప్రజలు, భక్తులు,అమ్మవారి మాల భక్తులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

