భర్తకు తీవ్ర గాయాలు
ఇందల్వాయి,బతుకమ్మ:ఇందల్వాయి మండలంలోని గన్నారం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గన్నారం గ్రామానికి చెందిన కుర్మ చిన్న బిజ్జి మల్లయ్య, అతని భార్య గంగవ్వ టీవీఎస్ ఎక్సెల్ పై వెళుతున్నారు. గన్నారం యూటర్న్ దగ్గరకు రాగానే వేగంగా వస్తున్న లారీ వెనుకు నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో మల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. అతని భార్య గంగవ్వ అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడ్డ మల్లయ్యను జిల్లా ఆసుపత్రికి తరలించారు. గంగవ్వ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

