26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యార్థులకు ఐడీ కార్డులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏఆర్పి క్యాంపు విద్యార్థులకు ఐడీ కార్డ్స్ ను ఏఆర్పి క్యాంప్ గ్రామ నివాసి, పూర్వ విద్యార్థి నిజామాబాద్ ఏడీఈ  తోట రాజశేఖర్  ఆయన తండ్రి జ్ఞాపకార్థం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రజిని కుమారి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారమందిస్తున్న తోట రాజశేఖర్ కు ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు దీటుగా చదివి పాఠశాల పేరును గ్రామం పేరును నిలబెడతారని పేర్కొన్నారు. తోట రాజశేఖర్ మాట్లాడుతూ మేము ఏ పదవిలో ఉన్న ఈ ఉన్నత స్థానంలో ఉన్న చదివిన పాఠశాలను, గ్రామమును ఎప్పటికీ మర్చిపోమని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని తెలిపారు.  విద్యార్థులందరూ మంచిగా చదివి గొప్ప విజయాలను సాధించి మన పాఠశాలకు గ్రామమునకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు బలరాం, శ్రీనివాస్ గౌడ్, రాజు పాల్గొన్నారు.

Distribution of ID cards to students

More articles

Latest article