నిజామాబాద్, బతుకమ్మ : వెల్ నెస్ హాస్పిటల్స్ సౌజన్యoతో ఏర్పాటు చేసిన 100 హెల్మెట్లను పోలీస్ కమీషనర్ సాయి చైతన్య మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి తమ వాహనాలను నడపాలని పేర్కొన్నాడు. ద్విచక్ర వాహనదారులు ప్రమాదానికి గురి అయినప్పుడు ముఖ్యంగా హెల్మెట్ లేనందున తలకు బలమైన గాయాలై చనిపోతున్నారని, అందువలన ద్విచక్ర వాహన దారులు అనుకోని ప్రమాదానికి గురైనప్పుడు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి అలాగే వారి యొక్క

కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా హెల్మెట్ ధరించిన తర్వాతనే ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ నెస్ హాస్పిటల్ యాజమాన్యం తాళ్ల సుమన్ గౌడ్, బొదు అశోక్, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఆర్ఐ వినోద్, ఎస్ఐ వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

