నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలోని హనుమాన్ టెంపుల్, దర్గా వద్ద కాలనీవాసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్ హెచ్ వో ఆరీఫ్ మాట్లాడుతూ ఆలయం, దర్గా పక్కన కాలనీవాసులు చెత్త వేస్తున్నారని, చెత్త వేయడం వలన లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ చెత్త వేయకూడదని అవగాహన కల్పించారు. ఒకవేళ ఎవరైనా అక్కడ చెత్త వేస్తే కేసులు నమోదు చేసి జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.

