25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లాలోని డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలోని డ్రాప్ అవుట్ విద్యార్థులను గుర్తించి వారు చెడులు వ్యసనాలకు లోను కాకుండా పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో అర్హతలకు అనుగుణంగా విద్య నేర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ సూచించారు. టాస్ అడ్మిషన్ డ్రైవ్ లో భాగంగా గురువారం జిల్లా అబ్జర్వర్ స్టేట్ కోఆర్డినేటర్ క్రాంతి రెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ను కలిసి ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల ప్రాధాన్యత ఎన్రోల్మెంట్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇది ఒక సదావకాశమని తెలిపారు. గడువులోగా జిల్లాకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

More articles

Latest article