26.6 C
Hyderabad
Monday, August 3, 2026

వికలాంగుల, చేయూత పింఛనుదారుల మహా గర్జన సన్నాహక సభ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ ఇరిగేషన్ విశ్రాంతి భవనంలో నియోజక ఇన్‌ఛార్జి  లసింగారి భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశం మాట్లాడుతూ ఈ నెల 23న బోధన్ అయేషా గార్డెన్‌లో మహా గర్జన సన్నాహక సభ జరుగుతుందని, దీనికి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రభుత్వం పింఛన్ల పెంపుపై ఇచ్చిన హామీ అమలు చేయలేదని ఆమె విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొడాలి స్వామి మాదిగ, కనక ప్రమోద్ మాదిగ, సలీం, తాడెం అబ్బయ్య మాదిగ, కృష్ణవేణి, యమునా మాదిగ, రొడ్డ ప్రవీణ్ మాదిగ, బండారి పోశెట్టి మాదిగ, గుమ్మట్టు పద్మ మాదిగ, గంధమల చంద్రయ్య మాదిగ, ఆకారం రమేష్ మాదిగ, రొడ్డ స్వప్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article