25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

వేల్పూర్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ప్రకారం తులం బంగారం పథకాన్ని వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి డిమాండ్ చేశారు. వివాహాలు జరిగి కొత్తగా మంజూరు కావాల్సిన బాల్కొండ(54),ముప్కాల్(39),ఏర్గట్ల(41) భీంగల్ (23)మండలాల కు చెందిన మొత్తం 157 కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ దరఖాస్తు లపై మంజూరు చేస్తూ సంతకాలు చేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మీ ,షాది ముబారక్ లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్ తో పాటు తులం బంగారం ఇవ్వాలి. కొత్తగా చెక్ లు మంజూరయ్యే లబ్దిదారులతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్ లు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

More articles

Latest article