వేములవాడ, బతుకమ్మ : శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీశైలంలో భక్తులు బారులు తీరారు.
