24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • యోగ గురూజీ పర్స అనంత్ రావు

 

భీమ్ గల్, బతుకమ్మ :  మొక్కులు తీర్చుకొనేందుకు భక్తితో భక్తులు వచ్చిపోయ్యే ఆలయాల ఆవరణ, ప్రాంగణాలు శుచితో పరిశుభ్రంగా ఉండాలని, అక్కడి ప్రాంతమంతా ఆహ్లాదంగా తీర్చిదిద్దాలని యోగ గురూజీ పర్స అనంత్ రావు అన్నారు. ఆదివారం యోగ బృందం ఆధ్వర్యంలో భగవత్ సనాతన ధర్మ పరిరక్షణ లో భాగంగా పట్టణ కేంద్రంలోని పలు ఆలయాల్లో ఆలయాల పరిశుభ్రత కార్యక్రమంను చేపట్టారు. ఈ సందర్బంగా పట్టణం లోని జంబీ గద్దె, ముచ్కూర్ రోడ్డులోని హనుమాన్ ఆలయం, నంధీశ్వరాలయాల్లోని పరిసరాలల్లో గల చెత్త చేదారం తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్బంగా గురూజీ మాట్లాడుతూ ఆలయాలకు వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగనాల్లో పరిశుభ్ర వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో యోగ సభ్యులు పాల్గొని శ్రమదానం చేశారు.

More articles

Latest article