కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లాలో 10మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిల్లీలో భాగంగా వీఆర్లో ఉన్న నలుగురికి పోస్టింగ్ ఇచ్చారు. అలాగే ఇద్దరు ఎస్సైలను వీఆర్కు పంపించారు. వీఆర్లో ఉన్న నవీన్ చంద్రను జుక్కల్కు బదిలీ చేశారు. రాఘవేంద్రను నస్రుల్లాబాద్ ఎస్సైగా నియమించారు. అరుణ్ కుమార్ను పెద్ద కొడప్గల్గా ఎస్సైగా బదిలీ చేశారు. రాజారాంనకు కామారెడ్డి టౌన్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. నస్రుల్లాబాద్ ఎస్సై లావణ్యను రామారెడ్డికి బదిలీ చేశారు. రాజంపేట ఎస్సై పుష్పరాజ్ను సదాశివనగర్ ఎస్సైగా బదిలీ చేశారు. సదాశివనగర్ ఎస్సై రంజిత్ను దేవునిపల్లి పీఎస్కు పంపించారు. జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ను దేవునిపల్లి-2 ఎస్సైగా బదిలీ చేశారు. దేవునిపల్లి ఎస్సై రాజు, పెద్ద కొడప్గల్ ఎస్సై మహేందర్ను వీఆర్కు పంపించారు.
