బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం రాంపూర్(కాలన్) గ్రామంలో గ్రామస్తుల సహకారంతో గురువారం సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని పిట్లం ఎస్ఐ రాజు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమని,ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని,ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సాయ గౌడ్,పంచాయతీ కార్యదర్శి భాస్కర్,గ్రామ మాజీ సర్పంచ్ మందడి నారాయణరెడ్డి,మాజీ ఎంపీటీసీ సునీత బలరాం రెడ్డి,గ్రామ ప్రజలు,గ్రామపంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
