భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని దేవక్కపేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బెస్తపు నరేందర్ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చేరి మృతి చెందగా వారి కుటుంబానికి బాల్కొండ కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆర్థిక సహాయాన్ని అందించారు. భాధిత కుటుంబానికి రూ. 5వేల నగదు ఆర్ధిక సహాయాన్ని అందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అరికెళ్ల సాయిలు, మలావత్ శ్రావణ్, మాలావత్ అజయ్, బొట్ల నర్సయ్య, రవీందర్,మోహన్ తదితరులు పాల్గొన్నారు.
