మోర్తాడ్,బతుకమ్మ: ప్రతిరోజు క్రీడలు ఆడటం వలన మానసిక ఉల్లాసం ఉంటుందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాలరావు అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం బడిబాట కార్యక్రమం ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. క్రీడల్లో మంచి ప్రతిభ చూపించిన క్రీడాకారులకు బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
