వేల్పూర్, బతుకమ్మ : పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరుకు వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సభ విజయవంతానికి గాను సోమవారం మండల పార్టీ కార్యాలయం లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మండల పార్టీ ప్రెసిడెంట్ బేల్ దారి నవీన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి భారీ ఎత్తు రైతులను తరలించాలని, నాయకులు, కార్యకర్తలు అందరు హాజరువాళ్ళని కోరారు. ఈ కార్యక్రమం కానిస్టెన్సీ కన్వీనర్ మల్కన్న గారి మోహన్, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.