27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

అడ్వకేట్స్ సొసైటీ ఎన్నికలు పూర్తి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆఫీస్ బేరర్స్ ఎన్నిక
  • అధ్యక్షునిగా కె. శ్రీనివాస్ ఏకగ్రీవం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా అడ్వకేట్స్ పరస్పర సహకార సొసైటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్నికలు పూర్తి చేసినట్లు ఎన్నకల ప్రధాన అధికారి ఎర్రం విగ్నేష్ తెలిపారు.అధ్యక్షుడిగా కొండడోళ్ళ శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా బోధన్ రవీందర్, కార్యదర్శి వెంకట రమణ గౌడ్, సంయుక్త కార్యదర్శి విప్లవ్ కిరణ్, కోశాధికారి శ్రీనివాస్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. డైరెక్టర్లుగా మాధాస్తు రాజారెడ్డ,శ్రీనివాస చక్రవర్తి, సంతోష్ నిర్మల్కర్,బిర్లా రామరావు,పి. వెంకటేశ్వర్, నారాయణ దాసు,కృష్ణ గోపాల్ రావు డైరెక్టర్లు గా ఎన్నికయ్యారు. ఎన్నికైన ఆపీస్ బేరర్స్ కు విగ్నేష్ ఎన్నికల ధ్రువపత్రాలు అందజేశారు.. ఈ సందర్బంగా అధ్యక్షుడు శ్రీనివాస్ మట్లాడుతూ సొసైటీ ఆర్థిక అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. సొసైటీ బలోపేతానికి నాయవాదుల సహకారం తీసుకుని ముందడుగు వేస్తామని అన్నారు.

More articles

Latest article