హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలలో భాగంగా తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా శిఖా గోయల్, సీఐడీ అడిషనల్ డీజీపీగా చారుసిన్హా, చార్మినార్ జోన్ డీఐజీగా తఫ్సీర్ ఇక్బాల్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా చైతన్య కుమార్, కొమురం భీం ఆసిఫాబాద్ ఎస్పీగా కాంతిలాల్ సుభాష్, మెదక్ జిల్లా ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారు ఉత్తర్వులు జారీ చేశారు.
