28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మీసేవ ఆధార్ సెంటర్ తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలంలోని అన్ని మీసేవ కేంద్రాలను ఆర్ఐ బాలయ్య బుధవారం సందర్శించి తనిఖీ చేశారు. అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు రావడంతో అన్ని మీ సేవలు కేంద్రాలను తనిఖీ చేశామన్నారు. అక్కడ ప్రజలకు రేట్ల చార్ట్ చూసి డబ్బులు చెల్లించాలని సూచించారు. అధిక డబ్బులు అడిగితే సంబంధిత అధికారుల నంబర్లు మీ సేవలో ఉంటాయని వాటికి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు స్టేషనరీ తప్పుగా వాడిన మీసేవ సెంటర్ రద్దు చేస్తామని ప్రతి మీసేవ వారు తప్పనిసరిగా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించారు.

Meeseva Aadhaar Center Check

More articles

Latest article