హైదరాబాద్, బతుకమ్మ: బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నాయని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. కేసీఆర్ చట్టానికి అతీతులు కారని, గతంలో ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారని అన్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం కాదని, కాళేశ్వర్ కమిషన్ ఇచ్చింది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టంచేశారు.
