భీమ్ గల్, బతుకమ్మ : రెక్కడితే గానీ డొక్కాడని మాకు సొంతయింటి కల సాకరం అవ్వడం సంతోషంగా ఉందని మెండోరా ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులు అన్నారు. గురువారం మండలంలోని మెండోరా గ్రామంలో ఎంపీడీవో సంతోష్ కుమార్ భూమి పూజ చేసి మార్కౌట్ ఇచ్చారు. ఈ సందర్బంగా లబ్దిదారులు మాట్లాడుతూ పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తో ఒక ఇంటివాన్ని చేస్తోందని అన్నారు. లబ్దిదారులందరు సీ. ఎం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, డిసిసి డెలిగేట్ కుంట రమేష్, వీడిసి అధ్యక్షులు గౌరు రాజన్న,కాంగ్రెస్ నాయకులు పల్లె శేఖర్, నారాయణ గంగాధర్, నరేందర్ ఖదీర్ షఫీ పోషణ దర్సింగ్ మేరా నరేష్ ఆనంద్, పంచాయతీ సెక్రెటరీలు ప్రశాంత్,రాకేష్,కరోబార్ భోజరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
