26.6 C
Hyderabad
Monday, August 3, 2026

పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు రావాలని జవాన్‌కు పిలుపు

Must read

📰 Generate e-Paper Clip

’దేశ రక్షణ కోసం నా సిందూరాన్ని బోర్డర్‌కు పంపుతున్నా‘ జవాన్ భార్య

వెబ్ న్యూస్, బతుకమ్మ :  పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని ఓ జవాన్‌కు పిలుపువచ్చింది.  మహారాష్ట్రకు చెందిన జవాన్‌ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది.  వివాహ సెలవుల మీద ఉన్న జవాన్‌ మనోజ్ పాటిల్‌కు.. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది.  మనోజ్ భార్య యామిని ‘నా సిందూరాన్ని దేశ రక్షణ కోసం బోర్డర్‌కు పంపుతున్నా’ అంటూ కన్నీటితో పంపించింది.  పెళ్ళైన మూడు రోజులకే తిరిగి బోర్డర్‌కు వెళ్లడంతో మనోజ్ పాటిల్ భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Soldier called to come to the border within three days of marriage

More articles

Latest article