ఎల్లారెడ్డిబతుకమ్మ: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సందేశం మేరకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసన సభ్యులు మదన్ మోహన్ ఆదేశాల ప్రకారం, గురువారం ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో “ఆపరేషన్ సిందూర్” సైనికులకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ గారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే మన సైనికుల పట్ల సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ ర్యాలీ చేపట్టాం. ‘ఆపరేషన్ సిందూర్’ కార్యక్రమం ద్వారా దేశభక్తిని ప్రేరేపిస్తూ, ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. ఈ సంఘీభావ కార్యక్రమంలో యువత, పార్టీ కార్యకర్తలు, ప్రజలు చురుకుగా పాల్గొనడం హర్షణీయం” అని అన్నారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
