26.6 C
Hyderabad
Monday, August 3, 2026

వరదలో చిక్కుకున్న ఆశ్రమ వాసులను రక్షించిన రెస్యూ టీం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా  

గత రెండు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం అధికంగా రావడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో సోమవారం ప్రాజెక్టు అధికారులు నలభై గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలారు. మెండోరా మండలం సావెల్ గ్రామంలో ఒకపక్క వాగు నీరు మరోపక్క గోదావరి నీరు వస్తున్న మధ్యలో కుర్రు (ఎత్తైన భూమి మీద) ఉన్నది. ఈ ఎత్తు ప్రాంతంలో సాంబయ్య ఆశ్రమం ఉంది. ఈ ఆశ్రమంలో నారాయణ, ముత్తెన్న, సంతోష్ అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వరద ఒక్కసారిగా ఆశ్రమాన్ని చుట్టుముట్టడంతో అక్కడే ఉండి తమ రక్షించాలని  స్థానికులకు సమాచారం అందించారు. దీంతో విషయాన్ని తెలుసుకున్న అధికారులు రిస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. ముగ్గురిని క్షేమంగా బయటకి తీసుకురావడంతో  స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.

The rescue team rescued the residents of the ashram trapped in the flood

More articles

Latest article