- డిఈఈ శ్రీనివాస్ రావు
ఇందూర్, బతుకమ్మ: విద్యుత్ ప్రమాదాల నివారణకు రక్షణ పరికరాలను వాడాలని నిజామాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రావు సిబ్బందికి సూచించారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలలో బాగంగా పవర్ హౌస్ లో ప్రమాదాల నివారణపై సమావేశం జరిగింది. దీనికి నిజామాబాద్ డిఈఈ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు రక్షణ కవచాలు లేకుండా పనులు చేయవద్దని వివరనాత్మకమైన సందేశాలను వెల్లడించారు. అనంతరం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ -1 సబ్ డివిజన్ ఏడీఈ ఆర్.చంద్రశేఖర్, ఏఈ కమర్షియల్ ఆర్. రాజేందర్ రెడ్డి, టౌన్-1 ఏఈ కె. నగేష్, టౌన్ -6 ఏఈ ఎంఏ. రవూఫ్, టౌన్ -1, టౌన్ -6 సిబ్బంధి పాల్గొన్నారు.
